Wednesday, 16 September 2026 04:05:17 AM
# కే.సి.కెనాల్ లో ప్రమాదవశాత్తుపడి పదో తరగతి విద్యార్థి మేకల లింగస్వామి మృతి # వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ # ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా సహకారం అందించాలి... సీఎం రేవంత్ రెడ్డి # సామూహిక దీక్షలో ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలి # ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం.. # చెన్నూర్ ను ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. # మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్...

సామూహిక దీక్షలో ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలి

సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్...

Date : 15 September 2026 10:44 PM Views : 10

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రేపటి సామూహిక దీక్షలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటున్నామని జిల్లా ఐసిడిఎస్ డి డబ్ల్యు ఓ, డి ఎం హెచ్ ఓ లకు సిఐటియు వినతి పత్రం అందజేత.. నేటి దీక్షలో సిఐటియు అనుబంధ యూనియన్ల ఉద్యోగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ తెలిపారు. సీఐటీయు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం రసిఐటియు ఆధ్వర్యంలో బుధవారం సెప్టెంబర్ 16నమంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సామూహిక నిరసన దీక్షలో జిల్లాలోని ఉద్యోగులు, కార్మికులు అందరు పాల్గొంటున్నామని తెలియచేస్తూ జిల్లా ఐసిడిఎస్ డి డబ్ల్యూ ఓ, డి ఎం హెచ్ ఓ లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గత రెండున్నర సంవత్సరాలుగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక వర్గం పోరాడుతుంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో, నిర్బంధంతో కార్మికులపై, పోరాడే సిఐటియు నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తుం దన్నారు. శాంతియుతంగా హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో ధర్నా చేస్తున్న అంగన్వాడీలను, ఆశ వర్కర్లను మహిళలని చూడకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లమీద ఈడ్చుకెళ్లడం, ఈ సందర్బంగా దోమలగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంగన్వాడిలను ఆశ వర్కర్లనుమావోయిస్టులు, నక్సలైట్లు వచ్చారాంటూ దుష్ప్రచారం చేసిన సీఐ పై చర్యలు తీసుకోవాలి. కార్మికుల పోరాటం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలు సరైంది కాదన్నారు. రేపు జరిగే జిల్లా కలెక్టరేటు ఎదుట జరిగే సామూహిక దీక్షలో జిల్లాలోని అంగన్వాడీలు ఆశ వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు ఐకెపి వివోఏలు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ , అన్ని రకాల హమాలీలు, హాస్టల్స్, హాస్పటల్స్ మెడికల్ కాలేజీ వర్కర్లు, సింగరేణి ఎంప్లాయిస్, సింగరేణి కాంటాక్ట్ కార్మికులు, బిల్డింగ్, ట్రాన్స్పోర్ట్ మరియు సంఘటిత అసంఘటిత రంగల ఉద్యోగ, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈకార్యక్రమంలోఎస్. శోభ , వి.పద్మ, భీమయ్య నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: