ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యావ్యవస్థ బలోపేతం దిశగా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్నఅవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను సందర్శించి వంటశాల, తరగతి గదులు, రిజిస్టర్లు,పాఠశాల పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాసంస్థల అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు.అన్ని ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్,మూత్రశాలలు, ప్రహరీ గోడ,అదనపు గదులు ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ క్రమంలో విద్యా సంవత్సరం ప్రారంభమైనందున జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు,పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించడం జరుగుతుందని,విద్యాశాఖ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,ప్రభుత్వ పాఠశాలలలో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులు పాఠశాలకు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News