ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : నిన్న మొన్నటి వరకు మున్సిపల్ కౌన్సిలర్ స్థానం దక్కితే చాలు అనుకున్న ఆశావహులు... మారిన రిజర్వేషన్ల తో కాసింత వెనకడుగు వేశారు. ఆయా వార్డుల్లో రిజర్వేషన్లు మహిళ కు కేటాయించటం తో కాసింత వెనకడుగు వేసినప్పటికీ... మరిపెడ మునిసిపల్ చైర్మన్ గిరి జనరల్ మహిళ కావటంతో తమ వ్యూహం మార్చుకున్నారు. తమకు ఏకంగా చైర్మన్ గిరి ఇస్తేనే బరిలో నిలుస్తామని చెబుతున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల అన్వేషణ కార్యక్రమం మొదలు పెట్టింది. ఇదిలా ఉండగా ఓ రాజకీయ పార్టీ కౌన్సిలర్ బరిలో నిలిచే అభ్యర్థులు రూ.15లక్షలు డీ డీ తీయాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇంతకాలం జెండా మోసిన తమకు లక్షల్లో డిడి లు తీయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు... దీంతో జంప్ జిలానీ కార్యక్రమానికి తెర లేవనుందన్న ఊహగానాలు బలంగా వినవస్తున్నాయి.
Admin
E Nivas News