Friday, 11 September 2026 10:12:44 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

టిజిఇ జెఏసి ఉద్యమానికి మంథనిలో ఉద్యోగుల మద్దతు

Date : 25 August 2026 06:28 PM Views : 72

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం టిజిఇ జెఏసి రాష్ట్ర కమిటీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం మంథని యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా టిజిఇ జెఏసి పెద్దపల్లి జిల్లా చైర్మన్, జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం అన్ని సంఘాలు ఒకే వేదికపై ఐక్యంగా నిలవడం చారిత్రాత్మకమన్నారు. పిఆర్సి అమలు, పెండింగ్‌లో ఉన్న 6 డిఎలు విడుదల, సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరణ, హెల్త్ కార్డుల సమర్థ అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 27న జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాను విజయవంతం చేసి, సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ మహా ధర్నాలో భారీ సంఖ్యలో పాల్గొనాలని , ఇది ఒక సంఘం ఉద్యమం కాదని, ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్, కార్మికుడి ఆత్మగౌరవ ఉద్యమమని పిలుపునిచ్చారు. టిజిఇ జెఏసి పెద్దపల్లి జిల్లా కన్వీనర్, టిజీఓ జిల్లా అధ్యక్షులు తూము రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి న్యాయమైన హక్కులు సాధించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంథని డివిజన్ ఉద్యోగులు ఆగస్టు 27 జిల్లా ధర్నాకు భారీ సంఖ్యలో తరలివచ్చి ఐక్యతను చాటాలని కోరారు. ఈ సమావేశంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యమ కార్యాచరణకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా టీఎన్జీఓ ల జిల్లా సంఘం కార్యదర్శి ఆయిరెడ్డి సందీప్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షురాలు గోపు అనిత, సౌమ్య, స్వప్న, ప్రవీణ్, శ్రీనివాస్ , టీజీఓ సంఘం కార్యదర్శి సురేష్, శ్రీనివాస్ , రవీంద్రనాథ్, సాజిద్, మంథని యూనిట్ టీఎన్జీఓ అధ్యక్షులు నూకల శంకర్, కార్యదర్శి పవన్, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గండు కృష్ణమూర్తి , మంథని యూనిట్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :