ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని అంకుశాపూర్ గ్రామపంచాయతీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక సర్పంచ్ సోదారి కల్పన. దేవయ్య. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కల్పన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు పరి ష్కరించే విధంగా నావంతు కృషి చేస్తూ నిధుల విషయంలో స్థానిక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి గ్రామపంచాయతీ అభివృద్ధి చేస్తానని అని ఆమె అన్నారు. ప్రభు త్వ పథకాలు ముందుగా పేదలకు అందే విధంగా నా వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరిం చు కొని గ్రామపంచాయతీ ప్రజలందరికీ ప్రత్యేకంగా శుభా కాంక్షలుతెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి అధి కారులతో పాటు ప్రజలందరూ పాల్గొన్నారు.
Admin
E Nivas News