ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతుల ఖాతాల్లోకి 'రైతుభరోసా' డబ్బులు రావాలంటేఒక్క రోజే ఛాన్స్ మిగిలి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'రైతుభరోసా' పెట్టుబడి సాయాన్ని పొందడానికి కొత్త రైతుల నమోదుకు ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ దరఖాస్తుకు సంబంధించిన పోర్టల్ ఈ నెల 16 తేదీ నుంచే అందుబాటులోకి రాగా ఇవాళ్టితో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 28 తేదీ నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు అప్లికేషన్ ఫాంను జతచేసి మండల కేంద్రాల్లోని ఏఈఓలకు సమర్పించాలి.
Admin
E Nivas News