Tuesday, 28 July 2026 09:32:37 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

విద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్..

పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ డిమాండ్

Date : 20 March 2026 07:20 PM Views : 141

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం జరగబోయే అసెంబ్లీ సమావేశం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తానని ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని,అంతేకాకుండా అనేక సందర్భాలలో, సభలలో విద్యారంగానికి 15% నిధులు కేటాయించివిద్యను అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 3,24,234 బడ్జెట్లో కేవలం విద్యారంగానికి 8.2% మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ విషయంలో పిడిఎస్ యు విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 7.57 కేటాయించగా ఈ బడ్జెట్లో కేవలం 0.6% కలిపి విద్యారంగానికి 8.2% మాత్రమే కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ ఆవునూరు మురళి ఇచ్చిన నివేదికలో విద్య రంగానికి 18 శాతం నిధులు కేటాయించాలని చూపించినప్పటికీ, ఆ నివేదికను ఏమాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్య రంగాన్ని కూని చేస్తూ కార్పొరేట్ విద్యకు వత్తాసు పలుకుతున్నా రన్నారు . తక్షణమే ప్రభుత్వం బడ్జెట్ సవరించి విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :