ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలంలోని కుంటాల గ్రామంలో ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రహరీ గోడ నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంజూరు అయిన రూ. 10 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ముందుగా పాఠశాల విద్యార్థినిలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థిని మాట్లాడుతూమా పాఠశాలకు అడిగిన వెంటనే సౌకర్యాలు ఎమ్మెల్యే కల్పించారని, ప్రోగ్రాంలకు స్టేజ్ లేదని కోరితే తక్షణమే స్టేజి నిర్మించారని, కోతుల బెడద ఎక్కువ ఉందని కోరితే తక్షణమే ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూప్రతీ పాఠశాలలో చదివే బిడ్డలు నా బిడ్డలే అని, పాఠశాలలో ఉన్న సమస్యలు అన్నీ తీర్చే బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News