ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అల్పపీడన ప్రభావంతో తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డు మర మత్తులు చేయాలని సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో గురువా రం నిరసన చేపట్టారు. గత కొన్నిసంవత్సరా లుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోడ్డు చాలా అద్వానంగా ఉందని హార్ట్ పేషం ట్స్ లేదా డెలివరీ పేషెంట్ గాని ఈ రోడ్డు పై వెలితే చనిపోయే అవకాశం ఉందన్నారు.కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అన్నమల్ల సురేష్ పాల్గొని 20,000 కోట్ల స్మార్ట్ సిటి డబ్బులు ఎటు పోయాయి అని ప్రశ్నించారు. నగరంలో అనేక రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని కోట్లు ఖర్చుపెట్టి నిర్మించ మని చెబుతున్న అధికారులకు, అభివృద్ధి కోసం నిధులు తెచ్చామన్న నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారులు మాత్రం మంచి రోడ్ల నిర్మించా మని అందమైన రోడ్లు అహ్లాదకరమైన వాతావరణం ప్రజలకు కల్పిస్తున్నా మని గొప్పలు చెప్పు కుంటున్న నాయకు లు అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. పట్టణంలో రోడ్లు దుస్థితి ఎలా ఉన్నాయో ఒకసారి రోడ్ల మీదికి వచ్చి చూస్తే అధికారులకు నాయకులకు అర్థమవుతుందన్నారు. నిధులు మింగడమే తప్ప పనులు మాత్రం చేయరని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా నాయ కులు అధికారులు స్పందించి ఈ గుంతల రోడ్లను బాగు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Admin
E Nivas News