ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నివాసంలో శనివారం కౌటాల మండలం పార్డి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ తొర్రెం దివాకర్ మరియు పెంచికల్పేట్ మండలం మోర్లిగూడ, జిల్లేడ గ్రామానికి చెందిన పోర్తేటి ప్రభాకర్ ఇతర నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ నడుంబిగించి పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘనపురం నాగేష్ , జునగరి మధుకర్, ప్రభాకర్, శోభన్, శ్రీకాంత్, చంద్రశేఖర్, శంకర్, జాడి శ్రీనివాస్, అరవింద్, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News