Tuesday, 28 July 2026 11:45:03 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

విద్యార్థులు మొబైల్ లో వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దు

ఏఎస్ఐ అన్వర్

Date : 14 October 2025 09:54 PM Views : 289

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు మీయొక్క మొబైల్లో వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని స్థానిక ఏఎస్ఐ అన్వర్ విద్యార్థులకు సూచించారు. సోమవారం పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాల,కళాశాల విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి చరణం లో ప్రతి ఒకరి ఇంట్లో స్మార్ట్ మొబైల్స్ ఉండడం సహజమేనని ఆ ఫోన్లో ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్లు తదితర తదితర ముఖ్యమైన విషయాలన్నీ అందులో ఉంటాయని సైబర్ మోసగాళ్లు పలు రకాల లింకులను పంపించడం జరుగుతుందని మీయొక్క తల్లిదండ్రులు సరిగ్గా విద్య రానివారైతే అలాంటి లింకులు ఓపెన్ చేసినట్లయితే డబ్బులు అన్ని దోచేసుకుంటారని తెలిపారు. మీరు చదువుకున్నారు కాబట్టి మీ తల్లిదండ్రులకు ఇట్టి విషయాన్ని క్లుప్తంగా వివరించాలని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు ఫోన్లో తదితర యాప్లు ఉన్నాయని ఆకులలో వచ్చే క్రీడలు తదితర వాటిని ఓపెన్ చేసి ఆడినట్లయితే వాటి ద్వారా కూడా డబ్బులు మోసపోయే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా తెలియని మెసేజ్లు కానీ లింకులు గానీ వచ్చినట్లయితే వాటిని ఓపెన్ చేయవద్దని కోరారు. విద్య నేర్చుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి కానీ డ్రగ్స్ గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు కావద్దని అన్నారు. అనంతరం పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిహెచ్ మంగ, ఏటీపీ తిరుమల్, పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు .

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :