ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు మీయొక్క మొబైల్లో వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని స్థానిక ఏఎస్ఐ అన్వర్ విద్యార్థులకు సూచించారు. సోమవారం పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాల,కళాశాల విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి చరణం లో ప్రతి ఒకరి ఇంట్లో స్మార్ట్ మొబైల్స్ ఉండడం సహజమేనని ఆ ఫోన్లో ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్లు తదితర తదితర ముఖ్యమైన విషయాలన్నీ అందులో ఉంటాయని సైబర్ మోసగాళ్లు పలు రకాల లింకులను పంపించడం జరుగుతుందని మీయొక్క తల్లిదండ్రులు సరిగ్గా విద్య రానివారైతే అలాంటి లింకులు ఓపెన్ చేసినట్లయితే డబ్బులు అన్ని దోచేసుకుంటారని తెలిపారు. మీరు చదువుకున్నారు కాబట్టి మీ తల్లిదండ్రులకు ఇట్టి విషయాన్ని క్లుప్తంగా వివరించాలని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు ఫోన్లో తదితర యాప్లు ఉన్నాయని ఆకులలో వచ్చే క్రీడలు తదితర వాటిని ఓపెన్ చేసి ఆడినట్లయితే వాటి ద్వారా కూడా డబ్బులు మోసపోయే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా తెలియని మెసేజ్లు కానీ లింకులు గానీ వచ్చినట్లయితే వాటిని ఓపెన్ చేయవద్దని కోరారు. విద్య నేర్చుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి కానీ డ్రగ్స్ గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు కావద్దని అన్నారు. అనంతరం పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిహెచ్ మంగ, ఏటీపీ తిరుమల్, పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు .
Admin
E Nivas News