ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలోని 13,245 ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి ఆడిట్ రిపోర్టులు సమర్పించకుండా తప్పించుకుంటున్నాయి. ఫీజుల దందాను దాచిపెట్టేందుకే ఈ రిపోర్టులు ఇవ్వడానికి వెనుకంజవేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 16 స్కూళ్లు మాత్రమే లెక్కలుసమర్పించడంతో, విద్యాశాఖ సీరియస్ అయింది. లెక్కలు ఇవ్వని 13,229 స్కూళ్లకు తక్షణమే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ఫీజుల వివరాలనువెబ్సైట్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని కూడా సూచించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు.
Admin
E Nivas News