Tuesday, 28 July 2026 06:12:06 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

గ్రామాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి..

సిపిఎం మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్

Date : 18 February 2026 07:32 PM Views : 103

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఇతర సంక్షేమ పథకాలను పేదలందరికీ దరిచేరే విధంగా అందించే విధంగా చూడాలని,సిపిఎం మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ అన్నారు. మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం నందిపాటి వెంకన్న అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్, మండల ఆర్గనైజర్ బాణాల రాజయ్య, లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వరస ఎన్నికలతో ప్రజాపాలన స్థబించి పోతుందని మున్సిపాలిటీ ఎన్నికలు కోడ్ పోకముందే మళ్లీ ఎంపిటిసి ఎన్నికలు ముందుకొస్తున్నట్లు తెలిపారు. దీంతో రైతులకు ఇవ్వాల్సిన బోనసు, మహిళలకు ఇవ్వాల్సిన 2500, ఆసరా పింఛన్లకు పెరగవలసిన పింఛన్లు ఆటంకంగా మారుతుయన్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ ప్రాబల్యంతో డబ్బు మద్యం ఏరులై పారుతున్న ఎలక్షన్ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేయడం వల్లనే విచ్చలవిడిగా ఓటర్లను కోటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మరోపక్క చాప కింద నీరుల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నూతన విద్యుత్ చట్టం, రైతు వ్యతిరేక చట్టాలు, కార్మికులకు ముప్పుగలుగే చట్టాలను తీసుకొస్తుందని వాపోయారు. ప్రజలు ఓట్లు డబ్బు మద్యం చుట్టూ తిరుగుతూ పాలకుల విధానాలను ఎండగట్టలేక పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే విధానానికి స్వస్తి పలకాలన్నారు. -వార్డు సభ్యురాలకు ఘన సన్మానం... డిసెంబర్ 17 న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ నుండి సిపిఎం వార్డు సభ్యురాలుగా గెలిచిన నందిపాటి ఉప్పలమ్మ వెంకన్న లను సిపిఎం మండల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్, నాయకులు బాణాల రాజయ్య, గ్రామ మాజీ ఉపసర్పంచ్ జిన్నా లచ్చయ్య, మాజీ వార్డ్ సభ్యురాలు జిన్నా మాధవి, కొండ ఉప్పలయ్య, ఎర్ర వెంకన్న, జినక జామ్మూర్తి, సైదులు, తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: