ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఇటీవల పదవి విరమణ పొందిన విశ్రాంత ఉపాధ్యాయులు బిరుదు మధు, బోనాల రవీందర్ లకు పెంజెరుట్ట కమిటీ ఆధ్వర్యంలో లోకే మనోహర్, టేక్కేగారి రాధాకృష్ణన్ లు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన వీరి సేవలను ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కేతిరెడ్డి రఘోతం రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోటికార్ కిషన్ జి, మంథని రమేష్, రాంపల్లి లక్ష్మణ్, పల్లి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News