ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లామందమర్రి పట్టణ మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డు గాంధీ నగర్ కాంట్రాక్టర్ బస్తి లో గత కొంత కాలంగా మురికి కాలువలో పూడికతీత పనులు చేపట్టకపోవడం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డు ఇంచార్జి కాంగ్రెస్ యువ నాయకులు ఎండీ, జావిద్ ఖాన్ పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి, రాజలింగు దృష్టికి తీసుకెళ్లాగా, స్పందించి ఆయన పరిసరాలను సందర్శించి మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం మున్సిపల్ సిబ్బంది గాంధీ నగర్ కాంట్రాక్టర్ బస్తి లోని మురికి కాలువల పూడికతీత పనులు. నిర్వహించి, రోడ్డుకు ఇరు వైపుల ఉన్న పిచ్చి మొక్కలు తొలగించడం తోపాటు ఏరియాలో చెత్త కుప్పలను సైతం శుభ్రం చేశారు. సమస్యలపై తక్షణమే స్పందించి, వాటిని పరిష్కరించన మున్సిపల్ కమిషనర్ కు నాయకులకు ఏరియా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ధన్యవాదాలు తెలిపారు.
Admin
E Nivas News