ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ సాకేతిక విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లి ప్రయ త్నం చేయవద్దని రాజన్న సిరిసిల్లలో పాలిటెక్నిక్ విద్యార్థు లు గురువారంఆందోళనకు దిగారు. శక్తి స్కీమ్ను రద్దు చేయడంతో పాటు జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురు వారం విద్యార్థులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీగా తరలి వచ్చారు. అనంతరం కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసు లు భారీగా మోహ రించి, కలెక్టరేట్ గేటు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోకి చొచ్చు కెళ్లేందుకు విద్యార్థు లు ప్రయత్నించడం తో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. బారికేడ్లను తోసు కుంటూ ముందుకు వెళ్లేందుకు విద్యార్థు లు ప్రయత్నించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించి పాలిటె క్నిక్ విద్యను కాపాడా లని ఎస్ఎఫ్ఐ నాయ కులు డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్కు వినతి పత్రం అందజేశారు.
Admin
E Nivas News