Thursday, 30 July 2026 04:15:51 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పౌర సరఫరాల శాఖ అధికారి

Date : 08 November 2025 11:30 AM Views : 264

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ రైస్ మిల్ యజమాని వద్ద జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి 75 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గురువారం రాత్రి పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మేనేజ‌ర్ న‌ర్సింగ‌రావు రూ.75వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మ‌ధు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం. ద‌హేగాంకు చెందిన సందీప్ వాస‌వి మోడ్ర‌న్ రైస్ మిల్లుకు ప్ర‌భుత్వం ఇచ్చిన వ‌డ్ల‌ను మిల్లులో పీడీఎఫ్ బియ్యం గా మార్చి గోదామ్ కి త‌ర‌లించేందుకు నాణ్య‌త లోపం ఎన్వోసీ ఇవ్వాల‌ని జిల్లా పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మేనేజ‌ర్ న‌ర్సింగ‌రావును రైస్ మిల్లు య‌జ‌మాని కోరాడు. అయితే రూ.25వేలు చొప్పున మూడు లారీల‌కు రూ75వేలు మొత్తం లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీనీ ఆశ్ర‌యించాడు. గురువారం రెబ్బెన మంచిర్యాల రోడ్డుపై లంచం తీసుకుంటుండ‌గా వెంబ‌డించి న‌ర్సింగ‌రావుతో పాటు టెక్నిక‌ల్ అసిస్టెంట్ మ‌ణికంఠ‌ల‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించ‌గా.. 16 లారీల‌కు లంచం తీసుకున్న‌ట్టు తెలిపారు. అధికారులు ఎవ్వ‌రైనా లంచం కోసం సామాన్య జనాన్ని వేధింపులకు గురి చేస్తే 91543-88963 అదిలాబాద్ ఏసీబీ డిఎస్పి ఈ నెంబర్ ఆశ్ర‌యించాల‌ని ఆయ‌న కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :