Tuesday, 15 September 2026 01:32:42 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పౌర సరఫరాల శాఖ అధికారి

Date : 08 November 2025 11:30 AM Views : 298

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ రైస్ మిల్ యజమాని వద్ద జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి 75 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గురువారం రాత్రి పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మేనేజ‌ర్ న‌ర్సింగ‌రావు రూ.75వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మ‌ధు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం. ద‌హేగాంకు చెందిన సందీప్ వాస‌వి మోడ్ర‌న్ రైస్ మిల్లుకు ప్ర‌భుత్వం ఇచ్చిన వ‌డ్ల‌ను మిల్లులో పీడీఎఫ్ బియ్యం గా మార్చి గోదామ్ కి త‌ర‌లించేందుకు నాణ్య‌త లోపం ఎన్వోసీ ఇవ్వాల‌ని జిల్లా పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మేనేజ‌ర్ న‌ర్సింగ‌రావును రైస్ మిల్లు య‌జ‌మాని కోరాడు. అయితే రూ.25వేలు చొప్పున మూడు లారీల‌కు రూ75వేలు మొత్తం లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీనీ ఆశ్ర‌యించాడు. గురువారం రెబ్బెన మంచిర్యాల రోడ్డుపై లంచం తీసుకుంటుండ‌గా వెంబ‌డించి న‌ర్సింగ‌రావుతో పాటు టెక్నిక‌ల్ అసిస్టెంట్ మ‌ణికంఠ‌ల‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించ‌గా.. 16 లారీల‌కు లంచం తీసుకున్న‌ట్టు తెలిపారు. అధికారులు ఎవ్వ‌రైనా లంచం కోసం సామాన్య జనాన్ని వేధింపులకు గురి చేస్తే 91543-88963 అదిలాబాద్ ఏసీబీ డిఎస్పి ఈ నెంబర్ ఆశ్ర‌యించాల‌ని ఆయ‌న కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: