Saturday, 13 June 2026 02:26:39 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం

Date : 14 January 2026 10:38 PM Views : 181

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో విద్యార్థినుల ఫోన్లు లాక్కొని సంక్రాంతి పండుగకు పంపించకుండా గదుల్లో నిర్బంధించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన విద్యార్థినుల స్వేచ్ఛ, భద్రత, మానవ హక్కులపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లోఅదీ బాలికల హాస్టళ్లలో ఇలాంటి చర్యలు చోటుచేసుకోవడం ఆందోళనకరం. పండుగ అనేది కుటుంబాలతో గడిపే సమయం కాబట్టి అలాంటి వేళ, సరైన ప్రకటన లేకుండా విద్యార్థినుల వ్యక్తిగత కమ్యూనికేషన్‌ను ఆపివేయడం, నిర్బంధం వంటి పరిస్థితులు సృష్టించడం నైతికంగా, పరిపాలనపరంగా సమర్థనీయం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి దృష్టికి వెళ్లగానే ఆమె వెంటనే స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో ఫోన్‌లో మాట్లాడి, హిందూ విద్యార్థినులను తక్షణమే వారి సొంతింటికి పంపించాలని కోరినట్లు సమాచారం. దీనిపై జిల్లా వైద్యాధికారి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థినులపై పాలకులుగా కాకుండా, సంరక్షకులుగా వ్యవహరించాల్సిన బాధ్యత హాస్టల్ నిర్వాహకులది. నియమాలు ఉంటే అవి స్పష్టంగా, సమానంగా, మానవీయంగా అమలవ్వాలి. మతం, లింగం, నేపథ్యం అనే తేడాలు లేకుండా విద్యార్థినులందరికీ సమాన హక్కులు కల్పించాల్సిందేనని, ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్ పరిపాలనపై పర్యవేక్షణ పెంచడం, ఫిర్యాదు వ్యవస్థలను బలోపేతం చేయడం అత్యవసరం. విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలబడాలంటే పండుగ వేళ విద్యార్థినుల కన్నీళ్లు కాకుండా, వారి ముఖాల్లో ఆనందమే కనిపించాలని, ప్రభుత్వం తీసుకునే చర్యలే రేపటి ప్రమాణాలకు అద్దం పడతాయి అనడంలో సందేహంలేదనే సర్వత్ర అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :