Tuesday, 15 September 2026 06:59:33 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం

Date : 14 January 2026 10:38 PM Views : 224

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో విద్యార్థినుల ఫోన్లు లాక్కొని సంక్రాంతి పండుగకు పంపించకుండా గదుల్లో నిర్బంధించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన విద్యార్థినుల స్వేచ్ఛ, భద్రత, మానవ హక్కులపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లోఅదీ బాలికల హాస్టళ్లలో ఇలాంటి చర్యలు చోటుచేసుకోవడం ఆందోళనకరం. పండుగ అనేది కుటుంబాలతో గడిపే సమయం కాబట్టి అలాంటి వేళ, సరైన ప్రకటన లేకుండా విద్యార్థినుల వ్యక్తిగత కమ్యూనికేషన్‌ను ఆపివేయడం, నిర్బంధం వంటి పరిస్థితులు సృష్టించడం నైతికంగా, పరిపాలనపరంగా సమర్థనీయం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి దృష్టికి వెళ్లగానే ఆమె వెంటనే స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో ఫోన్‌లో మాట్లాడి, హిందూ విద్యార్థినులను తక్షణమే వారి సొంతింటికి పంపించాలని కోరినట్లు సమాచారం. దీనిపై జిల్లా వైద్యాధికారి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థినులపై పాలకులుగా కాకుండా, సంరక్షకులుగా వ్యవహరించాల్సిన బాధ్యత హాస్టల్ నిర్వాహకులది. నియమాలు ఉంటే అవి స్పష్టంగా, సమానంగా, మానవీయంగా అమలవ్వాలి. మతం, లింగం, నేపథ్యం అనే తేడాలు లేకుండా విద్యార్థినులందరికీ సమాన హక్కులు కల్పించాల్సిందేనని, ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్ పరిపాలనపై పర్యవేక్షణ పెంచడం, ఫిర్యాదు వ్యవస్థలను బలోపేతం చేయడం అత్యవసరం. విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలబడాలంటే పండుగ వేళ విద్యార్థినుల కన్నీళ్లు కాకుండా, వారి ముఖాల్లో ఆనందమే కనిపించాలని, ప్రభుత్వం తీసుకునే చర్యలే రేపటి ప్రమాణాలకు అద్దం పడతాయి అనడంలో సందేహంలేదనే సర్వత్ర అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: