ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ను శుక్రవారం నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక తనకు మంత్రి పదవి వస్తుందని ప్రేమ్ సాగర్ ఆశించారు. ఆయన అదృష్టం మేరకు ఆయన ఆశలు నిరాశలు చేసి మంత్రి పదవిని గడ్డం వివేక్ ఇచ్చారు. దీంతో ప్రేమ సాగర్ రావు నిరాశ గురై వెంటనే ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ఆయనకున్న పరిచయాలతో మంత్రి అయ్యారు. పార్టీ కోసం పనిచేయడమే కాదు, కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన తనకు మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీలు మార్చిన వివేక్ కు ఎలా మంత్రి పదవి ఇస్తారంటూ ప్రేమ్ సాగర్ రావు అధిష్టానం పై అలిగారు. ఒకానొక దశలో ఆయన పై అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పిసిసి అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి మొదటి సభ ఇంద్రవెల్లి దండోరా, బట్టి విక్రమార్క పాదయాత్ర, మంచిర్యాల నిర్వహించే సభకు పిసిసి అధ్యక్షుడు మల్లికార్జున కర్గేను తీసుకొచ్చి భారీ బహిరంగ సభ విజయవంతం చేశారు. ఇలా ఎన్ని చేస్తే పదివి ఆయనకు ఇవ్వడం బహిరంగంగా విమర్శించారు. చివరికి ఆయన మాటను తీయకుండా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ నియమించడంతో మంచిరాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Admin
E Nivas News