ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం కాలేశ్వరం జోన్ జోనల్ కార్యాలయాన్ని జోనల్ అధికారి గిరిజ ప్రారంభించారు. అనంతరం జోనల్ అధికారి మాట్లాడుతూ జనవరి 6 లోపు కార్యాలయాలను ప్రభుత్వ సెక్టార్ భవనాలలోకి మార్చవలసిందిగా వచ్చిన ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, నిన్నటి వరకు మంచిర్యాల ఎం సి సి లోని ప్రైవేట్ భవనములో కొనసాగిన కాళేశ్వరం జోన్, జోనల్ కార్యాలయం లక్షెట్టిపేట లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయములో గల ప్రత్యేక భవనములోనికి మార్చామన్నారు. జోనల్ కార్యాలయప్రారంభ కార్యక్రమంలో జోనల్ ఆఫీసర్ తో పాటు, సీనియర్ వైస్ ప్రిన్సిపల్ కే మహేశ్వరరావు, కార్యాలయ సిబ్బందినవీన్, ధర్మేందర్, లక్ష్మణ చారి, నాగరాజు, జ్యోతి, లక్షెట్టిపేట కళాశాల వైస్ ప్రిన్సిపల్ గీతాంజలి, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ శిరీష, మంజుల, శ్రీలత, రజిత, సూపర్ ఇండెంట్ కుసుమ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ సాయికుమార్, రేవతి పాల్గొన్నారు.
Admin
E Nivas News