Friday, 11 September 2026 09:08:04 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

పెద్దపల్లికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు...

ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 20 August 2026 09:17 PM Views : 76

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మంజూరైన రైల్వే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాల్సిందేనని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణదక్షిణ మధ్య రైల్వే అధికారుల సమావేశంలో గట్టిగా డిమాండ్ చేశారు. ప్రజల నిధులతో మంజూరైన ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం సరికాదని స్పష్టం చేశారు. 1,000 కోట్లకు పైగా విలువైన ఆర్ఓబి లు, ఎఫ్ఓబిలు, ఇతర రైల్వే అభివృద్ధి పనులకు అనుమతులు వచ్చినా ఆన్‌గ్రౌండ్‌లో పనులు ప్రారంభం కాకపోవడం తీవ్ర విచారకరం* అని ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారుల వరకు నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. శాంక్షన్ ఇచ్చి పనులు చేయకపోతే ఆ నిధులు ఎందుకు నీ ప్రజల కోసం మంజూరైన ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం కాకుండా నేలమీద కనిపించాలి”అని వంశీకృష్ణ స్పష్టం చేశారు.పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు ఒక్కో స్టేషన్‌కు సుమారు ₹30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేలా కృషి చేస్తున్నామని ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు ₹150 కోట్ల విలువైన పనులు పూర్తయ్యేలా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి నుంచి రైల్వేకు భారీగా ఫ్రైట్ ఆదాయం వస్తున్నప్పటికీ, అదే స్థాయిలో పెద్దపల్లి ప్రాంతానికి రైల్వే మౌలిక వసతులు కల్పించకపోవడం పట్ల ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగరేణి, బొగ్గు గనుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, రైల్వే సరుకు రవాణాకు పెద్దపల్లి భారీగా ఆదాయం అందిస్తున్నా పెద్దపల్లికి రావాల్సిన అభివృద్ధి మాత్రం ఎందుకు ఆగిపోవాలని ప్రశ్నించారు. ఇది ఎవరి వ్యక్తిగత డబ్బు కాదు.. ప్రజల సొమ్ము. పెద్దపల్లి ప్రజల హక్కు. మంజూరైన ప్రతి రూపాయి అభివృద్ధి పనుల్లో ఖర్చు కావాల్సిందే” అని వంశీకృష్ణ తేల్చిచెప్పారు.బీజేపీ ప్రాతినిధ్యం లేని ప్రాంతాల పట్ల వివక్ష చూపుతున్నారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని, ఈ అంశంపై కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లి సమాధానం కోరుతామని తెలిపారు.పెద్దపల్లి హక్కుల కోసం ఢిల్లీ నుంచి క్షేత్రస్థాయి వరకు పోరాటం కొనసాగిస్తామని, మంజూరైన ప్రతి రైల్వే ప్రాజెక్టు ప్రారంభమయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :