ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల విద్యార్థులు సీఎం కబ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు శనివారం ప్రిన్సిపల్ డాక్టర్ కె. పురుషోత్తం తెలిపారు. ఫిబ్రవరి13 న రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీలు వివిధ క్రీడాంశాలలోనిర్వహించడం జరిగిందన్నారు. మంచిర్యాల పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల ( పురుషుల) నుండి 12 మంది విద్యార్థులు వారి యొక్క ప్రతిభను కనబరిచి వివిధ క్రీడా అంశాలలో పథకాలను గెలిచారన్నారు. క్యారం విభాగంలో 20 సంవత్సరాల బాలుర కేటగిరీలో ఎన్. నితిన్, బి. గణేష్, గోల్డ్ మెడల్స్ అలాగే ఆట్యా పాట్యా విభాగంలో 17సంవత్సరాల బాలుర విభాగంలో ఎన్. సచిన్, ఎల్.గణపతి గోల్డ్ మెడల్స్, అదేవిధంగా, పి ప్రణయ్ , పి. వెంకట్, పి. ధనుష్ ,పి.విష్ణువర్ధన్ 20 సంవత్సరాల రెస్లింగ్ విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించినట్లుగా కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు . ఈ సందర్భంగా పథకాలు గెలుపొందిన క్రీడాకారులను, ఫిజికల్ డైరెక్టర్ కొట్టే దేవేందర్ ని ఆదిలాబాద్ ఆర్. సి.ఓ. సేరు శ్రీధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ కే.పురుషోత్తం కళాశాల అధ్యాపకులు అభినందించారు.
Admin
E Nivas News