Wednesday, 29 July 2026 08:20:53 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు

Date : 30 January 2026 05:49 PM Views : 229

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుక లను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని హమాలి సంఘం వద్ద గల గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సబ్యులు, వాసవి క్లబ్ సబ్యులు కలిసి పులిహోర ప్యాకెట్, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది నవీన్ కుమార్ మాట్లాడుతూ దేశానికి గాంధీ చేసిన సేవల ను, ఆయన అహింస మార్గాన్ని కొనియాడుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. వాసవి క్లబ్ కాటా రం అధ్యక్షుడు మద్ది కమల మనోహర్ మాట్లాడుతూ అహింసా, సత్యాగ్రహాలే ఆ యుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్రాలు అందించిన మహనీయుడు జాతి పిత మహాత్మాగాంధీ అని అన్నాడు. సర్వజన హితం నామతం. అంటరానితనాన్ని అంత కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం అంటూ జాతి పిత మహాత్మాగాంధీ సందేశం ఇచ్చారని, నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడని, అదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం సంపాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాటారం గ్రామ సర్పంచ్ పంత కాని సడవలి, ఉప సర్పంచ్ కొండగొర్ల బానయ్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పవిత్రం శ్రీనివాస్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది నవీన్ కుమార్, కోశాధికారి దారం నందకిషోర్, వాసవి క్ల బ్ కాటారం అధ్యక్షుడు మద్ది కమల మనోహర్, ప్రధాన కార్యదర్శి అల్లాడి ఓం ప్రకాష్, కోశాధికారి మద్ది సంపత్, ఆర్యవైశ్య సంఘం సబ్యులు, వాసవి క్లబ్ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :