Monday, 14 September 2026 01:25:14 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం..

275 కోట్లతో ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి పనులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం

Date : 21 January 2026 10:08 PM Views : 219

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక తెలంగాణలోని ప్రతి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకుని అహర్నిశలు పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఆయన పర్యటించి సుమారు రూ. 275 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపనలు చేశారు. ముందుగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అభ్యర్థన మేరకు ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఆయన తపనకు మేము స్పందించి నియోజకవర్గాన్ని అభివృద్ధి Champions రూ. 275 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే ధర్మపురి నియోజకవర్గంలోని నేరెళ్ల ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయడానికి రూ. 200 కోట్లు మంజూరు చేశామన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు కు ధీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఉండడానికి తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అంతేకాకుండా గతంలో విద్యార్థులంద కలిసిమెలిసి చదువుకునేవారని ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అందుకోసమే విద్యార్థిని విద్యార్థులంతా ఒకచోట ఉండి చదువుకోవాలన్న ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రాష్ట్రంలో 100 ఇంటిగ్రేట్ పాఠశాలలు నిర్మాణం కోసం రూ. 22.500 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా మన విద్యార్థులంతా చదువుకొని కలెక్టర్లుగా పెద్ద పెద్ద కొలువుల్లో నిలవాలన్నదే సీఎం ఆకాంక్ష అన్నారు. సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటుంటే మన పేద విద్యార్థులంతా నిరుత్సాహం ఉండడం ఎందుకన్న ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కూడా సంపన్నులాగే మంచి కార్పొరేట్ విద్య చదువుకోవాలని, మంచి పౌష్టికరమైన భోజనాన్ని కూడా అందిస్తున్నామన్నారు. అలాగే మరో 63 కోట్ల40 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం కొలువుదిరిన వెంటనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం మాటను నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా వారి అభివృద్ధి ధ్యేయంగా వారికి జీరో వడ్డీకే 25 వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అంతేగాకుండా వారంతా పండుగ కూడా సంతోషంగా అవడం ఉండాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చామన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఖాళీగా జానా తో ఉన్న ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి అహర్నిశలు కష్టపడుతున్నామని తెలిపారు. రైతాంగానికి కూడా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా వారికి ఉచిత విద్యుత్తు, రైతు భరోసా తో పాటు వారు పండించిన వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే రైతాంగానికి సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు తదితర పరికరాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు కూడా నిరుపేదలను కట్టుకొమ్మన్నామని వారు కట్టుకున్న విధంగానే వారానికి ఒకసారి డబ్బులు వేస్తామన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ప్రభుత్వం తమ్మిదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్సింగ్ ఠాగూర్, ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: