Saturday, 13 June 2026 02:21:59 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం..

275 కోట్లతో ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి పనులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం

Date : 21 January 2026 10:08 PM Views : 176

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక తెలంగాణలోని ప్రతి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకుని అహర్నిశలు పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఆయన పర్యటించి సుమారు రూ. 275 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపనలు చేశారు. ముందుగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అభ్యర్థన మేరకు ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఆయన తపనకు మేము స్పందించి నియోజకవర్గాన్ని అభివృద్ధి Champions రూ. 275 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే ధర్మపురి నియోజకవర్గంలోని నేరెళ్ల ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయడానికి రూ. 200 కోట్లు మంజూరు చేశామన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు కు ధీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఉండడానికి తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అంతేకాకుండా గతంలో విద్యార్థులంద కలిసిమెలిసి చదువుకునేవారని ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అందుకోసమే విద్యార్థిని విద్యార్థులంతా ఒకచోట ఉండి చదువుకోవాలన్న ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రాష్ట్రంలో 100 ఇంటిగ్రేట్ పాఠశాలలు నిర్మాణం కోసం రూ. 22.500 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా మన విద్యార్థులంతా చదువుకొని కలెక్టర్లుగా పెద్ద పెద్ద కొలువుల్లో నిలవాలన్నదే సీఎం ఆకాంక్ష అన్నారు. సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటుంటే మన పేద విద్యార్థులంతా నిరుత్సాహం ఉండడం ఎందుకన్న ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కూడా సంపన్నులాగే మంచి కార్పొరేట్ విద్య చదువుకోవాలని, మంచి పౌష్టికరమైన భోజనాన్ని కూడా అందిస్తున్నామన్నారు. అలాగే మరో 63 కోట్ల40 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం కొలువుదిరిన వెంటనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం మాటను నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా వారి అభివృద్ధి ధ్యేయంగా వారికి జీరో వడ్డీకే 25 వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అంతేగాకుండా వారంతా పండుగ కూడా సంతోషంగా అవడం ఉండాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చామన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఖాళీగా జానా తో ఉన్న ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి అహర్నిశలు కష్టపడుతున్నామని తెలిపారు. రైతాంగానికి కూడా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా వారికి ఉచిత విద్యుత్తు, రైతు భరోసా తో పాటు వారు పండించిన వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే రైతాంగానికి సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు తదితర పరికరాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు కూడా నిరుపేదలను కట్టుకొమ్మన్నామని వారు కట్టుకున్న విధంగానే వారానికి ఒకసారి డబ్బులు వేస్తామన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ప్రభుత్వం తమ్మిదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్సింగ్ ఠాగూర్, ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :