ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు పత్తిని కొనుగోలు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగిన సమస్య పరిష్కారం కాక రైతులు ఆవేదన పడుతున్నారని ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ లోని ఏవో కార్యాలయంలో ఏవో కు రైతులు వినతిపత్రం అందజేశారు. అనంతరం డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కొరకు కపాస్ కిషన్ యాప్ లో ఆన్లైన్ చేద్దామంటే సిగ్నల్స్ పనిచేయడం లేదని వ్యవసాయ కార్యాలయం ఉదయం పూట వచ్చిన అధికారులుసమయపాలన పాటించకుండా కార్యాలయానికి రావడంతో రైతులు ఇబ్బందులు గురవుతున్నారన్నారు. వ్యవసాయ జిల్లా శాఖ అధికారి కూడా దీన్ని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి జిల్లాలో కనబడుతుం దన్నారు. ఆన్ లైన్ చేసి పది రోజులు అయిన కూడా పత్తి సిసిఐ తీసుకోవడం లేదన్నారు. ఆన్ లైన్ కాకపోవడంతో ఇక్కడికక్కడ రైతుల పట్టి ఇండ్లలో నిల్వ ఉంటుందని తద్వారా పత్తి పాడవుతుం దన్నారు. రైతులు నష్టపోతున్నారని, వెంటనే స్పందించాలని రైతుల సమస్య పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకానంద్ గొడిసెల కార్తీక్ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం నిఖిల్ పాల్గొన్నారు.
Admin
E Nivas News