ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండుబానేష్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా భీమిని మండలం అక్కలపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ. ఎస్టీ. బలహీన వర్గాలకు సంబంధించిన పేద రైతులు గత 50 సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని భూమిని ఆధారంగా చేసుకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని పోడు భూముల విషయంలో పట్టాలిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంతవరకు ఇవ్వకపోవడం రైతుల పట్ల నిర్లక్ష్యం చేయడమేనని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతు భరోసా పంట రుణాలు పొందలేక పోతున్నారని తెలిపారు. బయటి వారి దగ్గర అప్పులు తెచ్చుకొని సాగు వ్యవసాయానికి ఖర్చు చేస్తే అకాల వర్షాల వలన పంట నష్టం జరిగి పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగు రైతులకు పట్టాలు ఇవ్వాలని లేని ఎడల రైతులతో కలసి పట్టాలు వచ్చేవరకు రైతులను కూడగట్టి పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గం రాజేష్ రైతు సంఘం భీమిని మండల కార్యదర్శి చప్పిడి అన్నారావు, దుర్గం ఇస్తారి, జుమ్మడి శ్యామ్ రావు, దుర్గం బిక్కయ్య, చప్పిడి భీమయ్య, బుర్రి సంతోష్, చప్పిడి చిన్నయ్య, జాడి పోచయ్య, చప్పిడి పెంటయ్య, జుమ్మడి సువాస్, చప్పిడి బుద్ధుల్, నజీర్, దుర్గం ఓంకార్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News