Thursday, 30 July 2026 04:09:41 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలి

రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండు బాణేష్

Date : 21 October 2025 07:31 PM Views : 334

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండుబానేష్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా భీమిని మండలం అక్కలపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ. ఎస్టీ. బలహీన వర్గాలకు సంబంధించిన పేద రైతులు గత 50 సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని భూమిని ఆధారంగా చేసుకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని పోడు భూముల విషయంలో పట్టాలిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంతవరకు ఇవ్వకపోవడం రైతుల పట్ల నిర్లక్ష్యం చేయడమేనని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతు భరోసా పంట రుణాలు పొందలేక పోతున్నారని తెలిపారు. బయటి వారి దగ్గర అప్పులు తెచ్చుకొని సాగు వ్యవసాయానికి ఖర్చు చేస్తే అకాల వర్షాల వలన పంట నష్టం జరిగి పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగు రైతులకు పట్టాలు ఇవ్వాలని లేని ఎడల రైతులతో కలసి పట్టాలు వచ్చేవరకు రైతులను కూడగట్టి పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గం రాజేష్ రైతు సంఘం భీమిని మండల కార్యదర్శి చప్పిడి అన్నారావు, దుర్గం ఇస్తారి, జుమ్మడి శ్యామ్ రావు, దుర్గం బిక్కయ్య, చప్పిడి భీమయ్య, బుర్రి సంతోష్, చప్పిడి చిన్నయ్య, జాడి పోచయ్య, చప్పిడి పెంటయ్య, జుమ్మడి సువాస్, చప్పిడి బుద్ధుల్, నజీర్, దుర్గం ఓంకార్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :