Sunday, 13 September 2026 01:13:24 AM
# కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు..

ప్రజల సహకారంతోనే టీబీ రహిత సమాజం సాధ్యం...

వైద్యాధికారి సతీష్ కుమార్

Date : 13 March 2026 12:21 AM Views : 283

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజలందరి సహకారంతో త్వరలోనే టీబీ రహిత భారతదేశం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ అన్నారు .గురువారం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాల మూడో వార్డులో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రజలకు క్షయ వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షెట్టిపేట మండలం లోని కొత్తూర్ గ్రామాన్ని ఇటీవల టీబీ రహిత గ్రామంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా రెండవ విడత కార్యక్రమంలో అనుమానితులందరికీ ప్రజల వద్దకే వెళ్లి పోర్టబుల్ మోబైల్ ఎక్స్ రే ద్వారా ఎక్స్ రే పరీక్షలు నిర్వహించి టీబీ నిర్ధారణ చేసినట్లు తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వారు , బిపి , షుగర్ వున్నవారు , గుట్కా, అంబార్ తోపాటు బీడీ , సిగరెట్, మద్యం సేవించేవారు మరియు గతంలో క్షయ వ్యాధి సోకినవారి కుటుంబ సభ్యులు తప్పని సరిగా ఈ వైద్య శిభిరాలలో పరీక్షలు నిర్వహించుకుని వ్యాధి నిర్ధారించుకుని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. మహాలక్ష్మి వాడ లో మరియు ఈ రోజు ఇటిక్యాల వార్డులో రేపు ఊత్కూర్ ఏరియా లో క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంపు లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సతీష్ కుమార్ కోరారు. గురువారం ఇటిక్యాల లో 90 మందికి ఎక్స్ రే పరీక్షలు 20 మందికి తెమడ పరీక్షలు,100 మందికి షుగర్, బీపి తోపాటు సాధారణ పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందజేసినట్లు డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్ వైజర్ సురేష్ ,ఎంఎల్ హెచ్ పి అంజలి , హెల్త్ అసిస్టెంట్లు గఫూర్, ఇసాక్ అహ్మద్, ఏఎన్ఎం లు విజయదర్షిణి, చిలకమ్మ మరియు ఆశావర్కర్స్ హైమవతి, విజయ,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :