Thursday, 30 July 2026 12:39:32 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

Date : 19 November 2025 08:32 PM Views : 313

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం శుభనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. లక్షెట్టిపేట మండల కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక ఆర్ అండ్ బి విశ్రాంతిభవనంలో ఆ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందిరా గాంధీ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం నాయకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అరటిపండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. సామాజిక సేవ సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం నిజమైన కర్తవ్యమని తెలియజేశారు. 'ఇందిరా గాంధీ' భారతదేశంపై చెరగని ముద్ర వేసిన నాయకురాలు. ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశాభివృద్ధికి దిశగా ముందుకు నడిపించాయన్నారు. భారతీయ మహిళలకు ప్రాతినిధ్యం వహించిన తొలి ప్రధానమంత్రి, “ ఐరన్ లేడీ”గా దేశాన్ని ఎంతో ఆధునీకరించిన నేతగా,సమాజం కోసం, పేద ప్రజల కోసం ఎంతో కృషి చేసిన మార్గదర్శకురాలు ఇందిరా గాంధీ అన్నారు. ఆమె జీవితం నుండీ అందరూ స్ఫూర్తి పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఆర్టిఏ మెంబెర్ అంకతి శ్రీనివాస్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు, మండల యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్,మాజీ ఎంపీటీసీ మడిపెల్లి స్వామి, మున్సిపల్ వార్డ్ అధ్యక్షులు అమీర్, రవీందేర్, హజీ, సుగుణకర్, రాజమౌళి, నర్సింమ చారి,దుమ్మని సత్యం మరియు కార్యాకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :