Wednesday, 29 July 2026 10:32:59 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

దేశ సంస్కృతి సంప్రదాయాలకు కేంద్ర బిందువు ఆర్ఎస్ఎస్

ఆరు జిల్లాల సహాయ వ్యవస్థాపకులు మురళి

Date : 12 October 2025 04:18 PM Views : 424

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు దేశ రక్షణ పట్ల, సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్ర బిందువుగా అచంచల దీక్షతో ముందుకు వెలుతున్నారని ఆర్ఎస్ఎస్ ఆరు జిల్లాల సహాయ వ్యవస్థాపకులు దావునూరి మురళి అన్నారు. ఆదివారం మంథని గాంధీ చౌక్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశమంటే మనుషులే కాదు దేశమంటే మట్టి అని సంఘ్ భావిస్తుందన్నారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ సంస్థ దిన దినం అభిప్రాయంతో దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా పూర్తిగా విస్తరించిందని ఆయన గుర్తు చేశారు. 1962 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చూపిన ధైర్యసహసాలను గుర్తించిన అప్పటి ప్రధానమంత్రి దేశ సైనికులతో పాటు పరేడ్లో పాల్గొనాలని చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే అప్పటి ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ ఉన్నంతకాలం దేశం సుభిక్షంగా ఉంటుందని కొనియాడారన్నారు. ఏ సంస్థలో అయినా పదవుల పంచాయతీ ఉంటుందని ఆర్ఎస్ఎస్ లో మాత్రం క్రమశిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం కార్యవాహ గర్రెపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ విధి విధానాల పట్ల యువత ఎంతో ఆకర్షితులవుతున్నారని క్రమశిక్షణ కలిగిన ఆర్ఎస్ఎస్ మనిషి జీవన విధానానికి బాటలు వేస్తుందన్నారు. అనంతరం స్వయం సేవకులు గణ వేశ్ ధరించి సిటీ కేబుల్, లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం, ప్రణవి జూనియర్ కళాశాల, మహాలక్ష్మి దేవాలయం, మందాట, మంత్రపురి దర్శన్, జ్యోతిరావు పూలే కూడలి, అంబేద్కర్ కూడలి, శ్రీపాద చౌక్ మీదుగా గాంధీ చౌక్ కొరకు రూట్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధిక్ ప్రముఖ్ లక్కిరెడ్డి అన్వేష్, ధర్మ జాగరణ సేవా ప్రముఖులు మారుపాక నాగన్న కనుకుంట్ల స్వామి, పెద్దపల్లి వ్యవస్థాపకులు మాడిశెట్టి సుదర్శన్, సురేందర్, కొండపాక సత్య ప్రకాష్, లింగం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :