ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు దేశ రక్షణ పట్ల, సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్ర బిందువుగా అచంచల దీక్షతో ముందుకు వెలుతున్నారని ఆర్ఎస్ఎస్ ఆరు జిల్లాల సహాయ వ్యవస్థాపకులు దావునూరి మురళి అన్నారు. ఆదివారం మంథని గాంధీ చౌక్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశమంటే మనుషులే కాదు దేశమంటే మట్టి అని సంఘ్ భావిస్తుందన్నారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ సంస్థ దిన దినం అభిప్రాయంతో దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా పూర్తిగా విస్తరించిందని ఆయన గుర్తు చేశారు. 1962 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చూపిన ధైర్యసహసాలను గుర్తించిన అప్పటి ప్రధానమంత్రి దేశ సైనికులతో పాటు పరేడ్లో పాల్గొనాలని చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే అప్పటి ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ ఉన్నంతకాలం దేశం సుభిక్షంగా ఉంటుందని కొనియాడారన్నారు. ఏ సంస్థలో అయినా పదవుల పంచాయతీ ఉంటుందని ఆర్ఎస్ఎస్ లో మాత్రం క్రమశిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం కార్యవాహ గర్రెపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ విధి విధానాల పట్ల యువత ఎంతో ఆకర్షితులవుతున్నారని క్రమశిక్షణ కలిగిన ఆర్ఎస్ఎస్ మనిషి జీవన విధానానికి బాటలు వేస్తుందన్నారు. అనంతరం స్వయం సేవకులు గణ వేశ్ ధరించి సిటీ కేబుల్, లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం, ప్రణవి జూనియర్ కళాశాల, మహాలక్ష్మి దేవాలయం, మందాట, మంత్రపురి దర్శన్, జ్యోతిరావు పూలే కూడలి, అంబేద్కర్ కూడలి, శ్రీపాద చౌక్ మీదుగా గాంధీ చౌక్ కొరకు రూట్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధిక్ ప్రముఖ్ లక్కిరెడ్డి అన్వేష్, ధర్మ జాగరణ సేవా ప్రముఖులు మారుపాక నాగన్న కనుకుంట్ల స్వామి, పెద్దపల్లి వ్యవస్థాపకులు మాడిశెట్టి సుదర్శన్, సురేందర్, కొండపాక సత్య ప్రకాష్, లింగం శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News