ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హనుమకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిరిజన సంఘ నాయకుల అరెస్టులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని, రాష్ట్రంలోని పేద గిరిజన వర్గాల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెండింగ్ స్కాలర్ షిప్పులు, రియాంబర్స్మెంట్, ఉద్యోగ నోటిఫికేషన్లు తక్షణమే భర్తీ చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన గిరిజన సంఘాల కార్యకర్తలను కాకతీయ యూనివర్సిటి పోలీసులు, హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు.
Admin
E Nivas News