ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈ నెల11న రామగుండం కమిషనరేట్ హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మణ్ గురువారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా నజీర్పల్లి పైవంతెన వద్దరోడ్డుదాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తలకు తీవ్రగాయం కావడంతో పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి హిట్ అండ్ రన్ కేసును జైపూర్ పోలీసులు ఛేదించారు.ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీఐ నవీన్ కుమార్, ఎస్ ఐ భూమేష్ లు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి, సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారాన్ని క్షుణ్ణంగాపరిశీలించారుదర్యాప్తు లోప్రమాదానికి కారణమైన వాహనం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన TS20 Z 0012 నంబర్ గల ఆర్టీసీ బస్సుగా, బస్సు డ్రైవర్ను బెజ్జూర్కు చెందిన జంగిటి రాజేశంగా గుర్తించారు. ఆయన ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో లో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు, ప్రమాద సమయంలో బస్సు ఆసిఫాబాద్ నుంచి గోదావరిఖని వైపుప్రయాణిస్తున్నట్లు,విచారణ లో భాగంగా తన తప్పిదం ను ఒప్పుకొన్నాడని జైపూర్ ఎస్సై భూమేష్ తెలిపారు.
Admin
E Nivas News