ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రభుత్వ కళాశాలలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ (ఎఫ్ ఏ సీ)ఉషా అన్నారు. శుక్రవారం మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి కాలంలో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు నడుస్తున్నాయన్నారు. కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన, కాలానికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన, పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు, యోగ, ఎన్ఎస్ఎస్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థి యొక్క సామర్ధ్యాలను పెంపొందించేందుకు ఉదయం సాయంత్రం సమయంలో సైతం స్టడీ అవర్స్ చేపడుతున్నామన్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేటుకు వెళ్లే బదులు ప్రభుత్వ కళాశాలలో చదివిస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ కళాశాల నుండి గుండోజు శ్రీజ జిల్లాలో మొదటి స్థానం సాధించడం జరిగిందన్నారు. తల్లిదండ్రుల సహకారం ఉంటేనే ఇలాంటి ఫలితాలు సాధించడం జరుగుతుందన్నారు. ఎంతో అనుభవం ఉన్న అధ్యాపకులను వినియోగించుకొని విద్యార్థులు తమ సామర్థ్యాలకు మెరుగుపెట్టాలన్నారు. ఈ సమావేశంలో అధ్యాపకులు ఝాన్సీ, శ్రీధర్ రావు, తిరుపతి, తిరుమల్, శశాంక్, నగేష్, ఎల్ ఆర్ కే రెడ్డి, శ్రీదేవి, సబిత, మౌనిక, సురేష్ , దీపారాణి సిబ్బంది అనసూయ, ప్రభాకర్ పాల్గొన్నారు.
Admin
E Nivas News