ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని విద్యార్థి యువత స్వచ్ఛంద సంస్థ 42 వసంతాలు, యశస్సు సమాచార వేదిక 40 వసంతాల వేడుకలను విజయ వంతం చేయాలని కొండేల మారుతి కోరారు. సొమవారం సంస్థాగత కార్యాలయంలో సమాచార ఆహ్వాన పత్రిక లను గట్టు నాగన్న ఆవిష్కారించారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ రెండు వేలకు పైగా స్ఫూర్తి, ప్రయోజిత కార్యాక్రమాలు, చారిత్రాత్మక సమాచార సంచికల ఆవిష్కరణ, ప్రముఖుల సత్కార వీచీకలుగా యశస్సు శ్రేష్ఠ పతాకలై సంస్థ 40 వసంతాలు పూర్తి చేసుకున్నాయన్నారు. ఈ నెల12 న హైదరాబాద్ లోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆడిటోరియంలో ఉత్సవం నిర్వహిస్తున్నమన్నారు. శ్రేయోభిలాషులు హాజరై విజయ వంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు నాగన్న, తాటి బుచ్చయ్య గౌడ్, రామడుగు మారుతీ రావు, పోరెడ్డి వెంకట రెడ్డి, నారమల్ల కృష్ణ, కొమురవెల్లి, సత్యనారాయణ, పోతు జోతిరెడ్డిలు పాల్గొన్నారు.
Admin
E Nivas News