ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం హై స్కూలో భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో చిల్డ్రన్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మారి విద్యా బోధన చేశారు. పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల పట్ల నెహ్రు చూపించిన ప్రేమ ఆప్యాయతల కారణంగా ఆయనను చాచా నెహ్రూ అని పిలుస్తారన్నారు. పిల్లల మనసత్వాన్ని గౌరవించడం వారిలో సృజనాత్మకతను మేధస్సును ప్రోత్సహించి వారు సురక్షితమైన మంచి వాతావరణంలో చదువుకోవడానికి పిల్లల్ని ప్రోత్సహించాలని ప్రదీప్ రెడ్డి అన్నారు. ఉత్తమ విద్యాబోధన చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి బహుకరణ చేశారు. అలగే మంథని కి చెందిన నిఖిల్ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఆయన చేస్తున్న కృషికి గాను పాఠశాల యాజమాన్యం అభినందించి మెమంటాను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రవి కిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి ,స్రవంతి రెడ్డి, పావని రెడ్డి, సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News