Friday, 11 September 2026 07:39:14 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు..

కేసీఆర్‌ వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలి..! మంత్రి శ్రీధర్‌బాబు

Date : 09 September 2026 08:44 PM Views : 20

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలని, ఆయన వందేళ్లకు పైగా బతికుండాలనే తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారంస్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఎవరి చావునూ కోరుకునే సంస్కృతి కాదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనుభవంతో కూడిన మార్గదర్శకత్వంలో ప్రజాసేవ కొనసాగాలని తాము ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. చట్టసభల్లో ప్రజాసమస్యలపై చర్చించేందుకు నిబంధనలు ఉంటాయని, బీఆర్‌ఎస్ సభ్యులు లేవనెత్తాలనుకుంటున్న అంశాలను సభా నిబంధనావళి ప్రకారం సరైన రూపంలో స్పీకర్‌కు లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆయన హితవు పలికారు. చట్టసభల హుందాతనాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని, శాసనసభ ప్రాంగణంలో, సభ లోపల అసభ్యకరమైన పదజాలం వాడటం, అభ్యంతరకరంగా ప్రవర్తించడాన్ని ఏమాత్రం ఆమోదించే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్‌బాబుహెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని, స్పీకర్ స్థానాన్ని గౌరవిస్తూ సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలతో ప్రజల పక్షాన నిలబడాలే తప్ప, వివాదాలు సృష్టిస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :