Tuesday, 28 July 2026 08:48:06 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

సమాజంలో మహిళల పాత్ర మరువలేనిది

అదనపు కలెక్టర్ చంద్రయ్య...

Date : 08 March 2026 12:46 AM Views : 192

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సమాజంలో మహిళల పాత్ర మరువలేనిదని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య (స్థానిక సంస్థలు ) అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ముందస్తు అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లో పురుషుల కంటే ఎక్కువగా రాణిస్తున్నారన్నారు. వంట గదికే పరిమితం కాకుండా అంతరిక్షం వరకు ఏదైనా సాధించగలమని నిరూపిస్తున్నారని వివరించారు. అంతేకాకుండా నేడు పలు రకాల రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాల్లో మహిళలు తమ ప్రత్యేకత చాటుతున్నారని కొనియాడారు. మహిళలఅభ్యున్నతితోనే సమాజ పురోగతి సాధ్యమవుతుందని వెల్లడించారు. ముఖ్యంగా ఒక ఆడపడుచు చదువుకుని ఎదిగితే వారి కుటుంబం మొత్తం బాగుపడుతుందని తెలిపారు. ఎలాంటి ఆత్మనూన్యతకు గురి కాకుండా మహిళ తాము అనుకున్నది సాధించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు నూతన మున్సిపల్ పాలక వర్గ సభ్యులను పరిచయం చేసుకున్నారు. పలు వార్డులలో పారిశుద్ధ్య పనులను పరిశీలించి, మున్సిపల్ కమీషనర్ కు సూచనలు చేశారు. అదే విధంగా స్థానిక గోదావరి వద్ద తహసీల్దార్ తో కలిసి పుష్కరాల ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్,తహసీల్దార్ దిలీప్ కుమార్,మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్, కౌన్సిలర్లు సూరం చంద్రమౌళి, బిరుదుల సత్యనారాయణ,శనిగారపు చిన్నయ్య, బోడ రాజేంద్ర ప్రసాద్, పెట్టెం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: