ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా కొండగట్టులో వెలసిన ప్రజల ఆరాధ్య దైవం కొండగట్టు అంజన్న హనుమాన్ పెద్ద జయంతి వేడకలకు మంగళవారం వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. కొండగట్టు పెద్ద జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి హనుమాన్ భక్తులతో పాటు దీక్షపరుల భారీగా తరలి రావడంతో కొండగట్టు పరిసరాల ప్రాంతాలు కాషాయమయంగా మారాయి. వివిధ రాష్ట్రాల, జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మాలవిరమణ చేశారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ పరిసరాలన్నీ జైశ్రీరామ్ నినాదంతో మారు మ్రోగిపోయింది. జయంతి వేడుకల సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి తెల్లవారు జాము నుండే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున అధికార యంత్రాంగం అంజన్నకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అంజన్న నామ స్మరణతో కొండగట్టు పరిసరాలు మారు మోగుతున్నాయి. సోమవారం రాత్రి కొండగట్టు దేవాల యానికి చేరుకున్న కొందరు దూర ప్రాంతాల దీక్షపరులు అంజన్నకు ముడుపు లు ముట్టజెప్పి కళ్యా ణకట్ట భవనంలో మాలవిరమణ చేసి వెళ్తున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుం డా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తాగునీరు, చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణకు భారీగా పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగిత్యాల జిల్లా ఏసిపి భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Admin
E Nivas News