ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని సామాజిక సేవా దృక్పథంతో వితరణ చేసే ఆదర్శప్రాయమైన కార్యక్రమం దాతల సహకారంతో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-ఆరెంద విద్యార్థులకు టై,బెల్ట్,ఐడి కార్డ్, హౌస్ రిప్రెజెంటేషన్ బ్యాడ్జ్ లు, స్పోర్ట్స్ టీషర్ట్ లు, ప్యాంట్ లను శుక్రవారం వితరణ చేయడం జరిగింది. మంథని మండలం ఆరెంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈదులపల్లి నరసింహారావు తల్లి దివంగత విజయలక్ష్మి స్మారకార్థం విద్యార్థులకు సామాగ్రిని వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తండ్రి కీ.శే ఈదులపల్లి సత్యనారాయణ రావు జ్ఞాపకంగా గతంలో ప్రాథమికోన్నత పాఠశాల- చిల్లపల్లిలో వివిధ సామాగ్రి, ఉపకరణాలను వితరణ చేశానని, నేడు తమ తల్లి పేరిట ఆరెంద పాఠశాలలో వితరణ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు తనకు తోచిన చిన్న సహాయాన్ని అందించడం చాలా సంతృప్తికరంగా, సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆరెంద పాఠశాల విద్యార్థులకు వారు గావించిన వితరణ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆశిస్తూ ఈ సహాయాన్ని సి ఆర్ పి మల్లయ్య, ఉపాధ్యాయులు బి శ్రీలత, సువార్త, శ్రీవాణి, గియాజుద్దీన్, సహేందర్,మమత,జి శ్రీలత, అమన్, ఏ ఏ పి సి చైర్మన్ ప్రేమలత, గ్రామస్తులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
Admin
E Nivas News