ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలంలోని నూతన పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుండి రైతు భరోసా పథకం కింద దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి Dr. D.నవ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 వరకు భూ భారతి ద్వారా పాస్ పుస్తకాలు పొందిన రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు దరఖాస్తు ఫారం, బ్యాంక్ పాస్ బుక్, పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, ఫోటోలు ఆయా గ్రామాల వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని సూచించారు. ఇప్పటికే రైతు బరోసా పథకం లో నమోదైన రైతులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్ప్రస్టం చేశారు.
Admin
E Nivas News