ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఐటీడీఏ పరిధిలోని విద్యా దన్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలపై విచారణ చేపట్టాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యాదన్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నూట్రి గార్డెన్ పేరుతో కూరగాయలు పెంచడానికి తోటమాలిలు, వాచ్ మెన్, సూపర్వైజర్, కంప్యూటర్ ఆపరేటర్ అంటూ కొంతమందిని పనిలో తీసుకున్నా రన్నారు..నెలలు గడిచిన వారికి జీతం ఇవ్వడం లేదన్నారు.పనిలో తీసుకునే ముందు వర్కర్ల దగ్గర డబ్బులు కూడా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటూ నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేస్తన్న విద్యాధన్ ఆర్గనైజేషన్ సంస్థపై* విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఆయన వెంట సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News