ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సమాజంలోని అన్ని వర్గాలకు బిఎస్పీ జెండా అండగా ఉంటుందని వరంగల్ జోన్-2 ఇంచార్జ్ వరికిల్ల మల్లేష్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఆస్పరెంట్ అకాడమీ లో శుక్రవారం మంచిర్యాల జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించగా వరంగల్ జోన్ 2 ఇన్చార్జి వరికిల్ల మల్లేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసిన అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి వరికిల్ల మల్లేష్ మాట్లాడుతూ పూలే, చత్రపతి సాహు మహారాజ్, పెరియార్, అంబేద్కర్, కాన్సిరాం, ఇతర మహనీయుల వారి స్ఫూర్తి ఆశయ సాధన బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని, అన్ని వర్గాలకు అండ బిఎస్పి జెండా అండగా ఉంటుందని అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గం లలో బూత్ కమిటీలు, సెక్టర్ కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. మహనీయుల పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు నిరంతరం సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవాలని మంచిర్యాల జిల్లాలో పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలన్నారు. చెన్నూర్ నియోజకవర్గం నూతన ఇన్చార్జిగా దుర్గం గంగారం ను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ నెంబర్ శెట్టి ప్రవళిక మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జి పెట్టం చంద్రశేఖర్, నియోజవర్గం అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సిరివేని రాజేష్, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కుంటాల శ్రీనివాస్ మరియు పార్టీ సీనియర్ నాయకులు సేట్టి శంకరయ్య, జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News