ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని (నస్పూర్ మున్సిపాలిటీ) లోని కొత్త నాగార్జున కాలనీ ప్రాణహిత స్టేడియంలో 1,2,8,12,13,14,15,22,23,24,25 వార్డుల్లోని ఆడపడుచులందరికీ చీరలను మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి ఆరోగ్య బాగోలేక ఈ బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేయలేదని చెప్పారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఆరోగ్యం బాగవడంతో నా అక్క చెల్లెలకు సంక్రాంతి పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేయమని చెప్పారన్నారు. అనంతరం ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలుతెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు తదితరులుపాల్గొన్నారు..
Admin
E Nivas News