Wednesday, 29 July 2026 02:33:09 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఘనంగా మహా మండల పడి పూజ...

శరణు ఘోషతో పోరెత్తిన అభినవ శబరిమల...! పూజకు హాజరైన మంత్రి అడ్డూరి లక్ష్మణ్

Date : 27 December 2025 08:48 PM Views : 191

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అభినవ శబరిమలిగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెం అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం గురుస్వామి శ్రీశ్రీశ్రీ చక్రవర్తుల పురుషోత్తమాచార్య ఆధ్వర్యంలో మహా మండలపూజను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ హాజరై తమ మొక్కలు చెల్లించుకున్నారు. ప్రతి ఏట గూడెం అభినవ శబరిమలలో వేలాదిమంది స్వాములు దీక్షలు తీసుకోవడంతో పాటు ఇక్కడే మాలలు కూడా విరమణ చేస్తుంటారు. వచ్చిన స్వాములందరికీ మకరజ్యోతి దర్శనం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కార్తీక మాసం పురస్కరించుకొని మకర సంక్రాంతి వరకు ఈ ఆలయంలో గురుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర లోని పలు జిల్లాల నుండి కూడా వందలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడే మాల వేసుకుని మాల విరమణ కూడా చేస్తారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. మకర సంక్రాంతి పర్వదినాన ఇదే ప్రాంతంలో మకరజ్యోతి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో సమీపాన్ని సత్యదేవుని ఆలయంతో పాటు సాయిబాబా ఆలయాలు కూడా ఉండడంతో ప్రత్యేకత సంతరించుకుంది. వచ్చిన భక్తులు స్వాములంతా ముందుగ ఆలయాల సమీపంలో గల పుణ్య గోదావరిలో స్నానాలు ఆచరించి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :