ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థు లకు ఉదయం అల్పా హారం మధ్యాహ్నం భోజనం అందించా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. జూన్ నెల నుండి ప్రారంభమ య్యే నూతన విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తున్నట్లు సమా చారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసు కున్నారు. స్కూళ్లతో సమానంగా జూనియ ర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సైతం ప్రతిరోజూ ఉద యం హెల్తీ బ్రేక్ఫాస్ట్ అల్పాహారం, పాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఆధ్యాత్మిక రంగానికి పెద్దపీట వేస్తూ.. రాబోయే 2027 గోదావరి పుష్కరాల పనుల కోసం ఏకంగా రూ. 1,000 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలపడమే కాకుండా, అందులో మొదటి విడత కింద రూ.300 కోట్లు తక్షణ మే మంజూరు చేస్తూ పచ్చజెండా ఊపింది. ఉద్యోగార్థులకు కూడా తెలంగాణ కేబినెట్ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్త పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమో దం తెలిపింది. ఇందు లో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధరలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, 6 నాన్- టీచింగ్ పోస్టులతో పాటు అవుట్సోర్సింగ్ పద్ధతిన మరో 3 పోస్టు ల నియామకాలకు క్లియరెన్స్ ఇచ్చింది. వీటితో పాటు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఫైర్ స్టేషన్ అగ్నిమాపక కేంద్రం నిర్వహణ కోసం మరో 18 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశం లో అటు విద్యార్థులకుఇటు నిరుద్యోగులకు భక్తులకు ఎంతో మేలు చేకూర్చేలా పలు నిర్ణ యాలు తీసుకుంది.
Admin
E Nivas News