ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తు న్న పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. రేపు బుధవారం మధ్యాహ్నం ఈ ఫలితా లను వెల్లడించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి ప్రధాన పరీక్షలు ఈ నెల 13వ తేదీతో ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యా శాఖ యుద్ధ ప్రాతిపదికన మూల్యాంకన ప్రక్రియను చేపట్టింది. ఈ నెల 23వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలను అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేయాలని అధికారులునిర్ణయించారు. వాస్తవానికి మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావించినప్పటికీ విద్యా ర్థులపై ఒత్తిడి తగ్గించేందు కు, పై చదువుల ప్రవేశాల కు వీలుగా ఈ నెల 29నే ఫలితాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధ మైంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా సానుకూల స్పందన లభించినట్లు సమాచారం.ఈ ఏడాది ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు కె.కేశవరావు అధికారి కంగా విడుదల చేయను న్నారు. ఇప్పటికే మార్కుల నమోదు, సాంకేతిక తనిఖీ లు పూర్తి కావచ్చాయని, విద్యార్థులు తమ ఫలితా లను అధికారిక వెబ్సైట్లలో చూసుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ తెలిపింది.
Admin
E Nivas News