Wednesday, 29 July 2026 08:19:15 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం....

ఎంపీ. గడ్డం వంశీకృష్ణ

Date : 09 May 2026 12:17 AM Views : 182

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా గంపల పెళ్లి కొత్తూరు గ్రామాలలో జరిగిన ప్రమాదంలో గోడ కూలి రైతులకు మృతి చెందగా ఆ ప్రదేశాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, లక్షెట్టిపేట తహసిల్దార్ దిలీప్ కుమార్, డి సి సి ప్రతినిధి రఘునాథ్ రెడ్డి, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. అకాల వర్షం కారణంగా లక్షెట్టిపేట మండలం కొత్తూరు లోని కొనుగోలు కేంద్రంలో జరిగిన ప్రమాదంలో రైతులు మృతి చెందడం బాధాకరమని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారంలో భాగంగా రవాణా ప్రక్రియలో లారీ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, కొత్తూరు కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ధాన్యాన్ని నెల్కివెంకటాపూర్ లోని గోదాముకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అకాల వర్షం కారణంగా ప్రమాదంలో మృతి చెందిన కొత్తూరు గ్రామానికి చెందిన వెంకటేష్, గంపలపల్లి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు తనుగుల నాగరాజు, అభిరామ్ కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కి లచ్చన్న కుటుంబాన్ని జిల్లా కలెక్టర్, దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే లతో కలిసి పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ముందుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, లక్షెట్టిపేట మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి మండలంలోని మిట్టపల్లి లో శ్రీరామకృష్ణ ట్రేడర్స్ రైస్ మిల్లును సందర్శించి అక్కడ నెలకొన్న లారీ ధాన్యం దిగుమతి, హమాలీల సమస్యను పరిష్కరించే దిశగా వారితో సమీక్షించారు. ప్రభుత్వం లారీలతో పాటు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం రవాణాకు అవకాశం కల్పించిందని, లారీల నిర్వాహకులు సహకరించాలని, ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా జరిగేలా హమాలీలు కలిసి రావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో హమాలీలు, లారీల నిర్వాహకులు జిల్లా కలెక్టర్ చెప్పిన అంశాలను అంగీకరించడంతో పరిస్థితి అనుకూలంగా మారింది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: