Monday, 14 September 2026 06:37:38 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం....

ఎంపీ. గడ్డం వంశీకృష్ణ

Date : 09 May 2026 12:17 AM Views : 218

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా గంపల పెళ్లి కొత్తూరు గ్రామాలలో జరిగిన ప్రమాదంలో గోడ కూలి రైతులకు మృతి చెందగా ఆ ప్రదేశాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, లక్షెట్టిపేట తహసిల్దార్ దిలీప్ కుమార్, డి సి సి ప్రతినిధి రఘునాథ్ రెడ్డి, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. అకాల వర్షం కారణంగా లక్షెట్టిపేట మండలం కొత్తూరు లోని కొనుగోలు కేంద్రంలో జరిగిన ప్రమాదంలో రైతులు మృతి చెందడం బాధాకరమని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారంలో భాగంగా రవాణా ప్రక్రియలో లారీ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, కొత్తూరు కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ధాన్యాన్ని నెల్కివెంకటాపూర్ లోని గోదాముకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అకాల వర్షం కారణంగా ప్రమాదంలో మృతి చెందిన కొత్తూరు గ్రామానికి చెందిన వెంకటేష్, గంపలపల్లి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు తనుగుల నాగరాజు, అభిరామ్ కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కి లచ్చన్న కుటుంబాన్ని జిల్లా కలెక్టర్, దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే లతో కలిసి పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ముందుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, లక్షెట్టిపేట మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి మండలంలోని మిట్టపల్లి లో శ్రీరామకృష్ణ ట్రేడర్స్ రైస్ మిల్లును సందర్శించి అక్కడ నెలకొన్న లారీ ధాన్యం దిగుమతి, హమాలీల సమస్యను పరిష్కరించే దిశగా వారితో సమీక్షించారు. ప్రభుత్వం లారీలతో పాటు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం రవాణాకు అవకాశం కల్పించిందని, లారీల నిర్వాహకులు సహకరించాలని, ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతంగా జరిగేలా హమాలీలు కలిసి రావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో హమాలీలు, లారీల నిర్వాహకులు జిల్లా కలెక్టర్ చెప్పిన అంశాలను అంగీకరించడంతో పరిస్థితి అనుకూలంగా మారింది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :