ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శనివారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికలవిద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తరగతిగదులు,వంటశాల,హాజరుపట్టికలు,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూఅన్ని ప్రభుత్వ పాఠశాలలలో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం మరలా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, అదనపు గదులు, ప్రహరీ గోడ ఇతర సదుపాయాలు కల్పించి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మార్చురీ గది నిర్మాణ పనులనుపరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు. ఆసుపత్రి లోని రోగులతో మాట్లాడుతూ కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News