Monday, 14 September 2026 08:01:20 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఊరూరా నాగుల చవితి వేడుకలు

నాగేంద్రుడికి ఘనంగా పూజలు

Date : 25 October 2025 02:58 PM Views : 382

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : నాగుల చవితి వేడుకలు శనివారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. మంథని పట్టణంలోని నాగుల సంధిలోగల నాగమయ్య పుట్ట వద్ద భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం వరకు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని నూతన వస్త్రాలను, అనేక రకాలైన పదార్థాలతో పాటు పండ్లు ఫలాలు నైవేద్యంగా సమర్పించారు. నాగుల చవితి రోజున ఉపవాసం ఉండి స్వామివారి సేవ చేస్తే సకల దోశాల నివారణ జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే మంథని మండలంలోని ఎంతో ప్రత్యేకత గల గాజులపల్లి లోని నాగమయ్య పుట్టను, కూచిరాజుపల్లెలోని నాగమయ్యను వేల సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ రోజున 108 సార్లు శ్రీ నాగేంద్ర య నమః అని జపిస్తే నాగమయ్య కృపకు పాత్రులు అవుతారు. అలాగే బియ్యపిండి పాలు చక్కెరతో చేసిన చమిలిని బ్రాహ్మణునికి సమర్పిస్తే నాగదేవత ఎంతో తృప్తి చెందుతుందని శాస్త్రాలలో చెప్పబడింది. పాములకు చేసే ఏదైనా పూజ నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ప్రపంచంలో పాములు ఆకాశం, స్వర్గం, సూర్యకిరణాలు, సరస్సులు, బావులు, చెరువులలో నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు. నడుము తొక్కితే నావాడు అనుకో, పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో, తోక తొక్కితే తోటి వాడు అనుకో నా కంట నువ్వు పడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని నాగమయ్యను వేడుకుంటారు భక్తులు. పుట్ట నుండి మట్టి తీసుకొని కళ్ళకు, చేవులకు రాసుకుంటే దోష నివారణ జరుగుతుందని భక్తుల నమ్మకం.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :