ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ములుగు : మావోయిస్టు పార్టీకి చెందిన మరో అగ్రనేత తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అలియాస్ గోపన్న, నేతృత్వంలో భారీగా క్యాడర్ లొంగిపోయే అవకాశముందని భారీ ప్రచారం జరుగుతోంది. సాంబయ్య ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దుల గూడెం గ్రామవాసి కాగా మూడు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నాయకుడు సాంబయ్య లొంగిపోతున్నాడన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్,అలియాస్ గోపన్నతో పాటు మరికొంత మంది లొంగి పోనున్నట్టు సమాచారం. వీరి లోంగుబాటుతో దాదాపు 90% అగ్రనాయకత్వం జనజీవన స్రవంతిలోకి వచ్చినట్టేనని భావిస్తున్నారు.
Admin
E Nivas News