ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్శనలో ఆయన ముఖ్యంగా కింది అంశాలపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. గర్భిణీ స్త్రీల నమోదు గురించి, గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన 12 వారాల లోపే తప్పనిసరిగా పేర్లను నమోదు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. మొదటి రెండు పరీక్షలు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో,ఆ తర్వాత పరీక్షలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించాలని సూచించారు. 30 ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహించి అవసరమైన మందులు అందజేయాలని ఆదేశించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును, ఆన్లైన్ పోర్టల్లలో డేటా అప్డేట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు, అనంతరం వార్డ్ లో ఉన్న పేషెంట్స్ తో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు, ఈ కార్యక్రమం లో మరిపెడ వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి,డాక్టర్ పూజిత,హెల్త్ ఎడ్యుకేటర్ రాజు,స్టాఫ్ నర్స్ మమత తదితరులు పాల్గొన్నారు,
Admin
E Nivas News